మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం దగ్గర గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతిని జాలరి కాపాడాడు. గూడెం వంతెనపై నుంచి నదిలో దూకిన యువతిని గమనించిన స్థానిక మత్స్యకారుడు వెంటనే పడవలో నదిలోకి వెళ్ళి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. నీటిలో మునిగి పోతున్న యువతిని అతి కష్టమ్మీద పడవలోకి చేర్చి బయటకు తీసుకు వచ్చాడు. అయితే ఆ యువతి బలవన్మరణానికి ఎందుకు పాల్పడబోయిందో ఇంకా తెలియలేదు. బాధితురాలిది మంచిర్యాలకు చెందిన యువతిగా గుర్తించారు. సమయానికి నదిలోకి వెళ్ళి యువతిని కాపాడిన జాలరిని పలువురు అభినందించారు.