ప్రకాశం జిల్లాలో పరువు హత్య.. అమ్మాయికి ఉరేసి, కాల్చేశారు?

Update: 2018-10-29 09:01 GMT

ప్రకాశం జిల్లాలో యువతి మృతి కలకలం రేపుతోంది. కోమరోలు మండలం నాగిరెడ్డి పల్లికి చెందిన ఇంద్రజను కుటుంబ సభ్యులే ఉరి వేసి చంపేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. వేరే కులస్థుడిని ప్రేమించిందన్న కారణంతోనే ఇంద్రజను హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున దహనసంస్కారాలు నిర్వహించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలో చైతన్య అనే యువకుడిని ఇంద్రజ ప్రేమించినట్టు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి కాలేజ్‌కు వెళ్లే వారని.. ప్రేమ విషయం తెలుసుకున్న ఇంద్రజ కుటుంబ సభ్యులు మందలించినట్టు సమాచారం. అయితే, పెద్దలు బెదిరించినా వినకపోవడంతో... ఇంద్రజను హత్య చేసినట్టు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. పరువు హత్యపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరుతో ప్రణాలు తీయడం సరైందని కాదని మహిళా సంఘం నేతలు చెబుతున్నారు. 

Similar News