హైదరాబాద్ అబిడ్స్లో విషాదం చోటు చేసుకుంది. పది అంతస్థులున్న మయూరీ కాంప్లెక్స్ పై నుంచి ఓ యువతి కిందికి దూకింది. తల పగలడంతో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే అమ్మాయి మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఇటు యువతి బిల్డింగ్ పై నుంచి దూకే దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. దీంతో ఫూటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.