కార్పొరేటర్‌ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ..!

Update: 2018-05-26 11:38 GMT

ఖమ్మంలోని అధికార పార్టీ కార్పోరేటర్లు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కార్పోరేటర్ శశికళ భర్త వీరేందర్‌పై ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తన ఇంటి ప్రహరిగోడను కూల్చి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ వాదులాటకు దిగింది. దాడికి యత్నించిన మహిళపై తన జులుం ప్రదర్శించిన వీరేందర్  ..అంతుచూస్తానంటూ  బెదిరింపులకు దిగారు.

ఖమ్మం నగరంలోని ఐదో డివిజన్‌లో మల్సూరు సుజాత దంపతులకు నివాస భూమి ఉంది. ఈ భూమిపై  కన్నేసిన నలుగురు కార్నొరేటర్‌లు కొంతకాలంగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉదయం మల్సూరు దంపతుల ఇంటికి వెళ్లిన 23వ డివిజన్ కార్పొరేటర్‌ పొట్ల శశికళ భర్త వీరెందర్ దౌర్జన్యానికి దిగినట్టు తెలుస్తోంది. సుజాత దంపతుల నివాసానికి సంబంధించిన ప్రహారీ గోడను అతను కూల్చివేయించడంతో మల్సూరు సుజాత కార్పొరేటర్ భర్తపై తిరగబడ్డారు. ఎలా తన ఇంటి గోడను కూల్చేస్తారంటూ.. అతనికి చెప్పుతో దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతను ఆమెను కిందపడేసి.. తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
 

Similar News