కేంద్రమంత్రి సుష్మా స్వ‌రాజ్‌ సంచలన నిర్ణయం..

Update: 2018-11-20 10:05 GMT

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై సంచలన ప్రకటన చేసింది. వచ్చేఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రధానంగా తన ఆరోగ్యసమస్యల దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుష్మా తెలిపింది. కాగా ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో అనే అంశాన్ని ఇక పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీచేయలేను అని పార్టీకి కూడా వెల్లడించనని సుష్మా తెలిపారు. 

Similar News