ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వారికి గుర్తింపు కార్డులున్నా ఓటరు స్లిప్పుల్లేవని కొందరిని, అసలు ఓటర్ లిస్టులో పేర్లే లేవని మరికొందరిని అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. ఆర్మూరులో 2వేల ఓట్లు గల్లంతు కాగా, బిచ్కుందలో 2వేల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇంకా జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.