జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను విడుదల చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆ వీడియో టెలీకాస్ట్ను వెంటనే నిలిపివేయాలని అన్ని టెలివిజన్ ఛానెల్స్ను ఆదేశించింది. ఈ వీడియోను ప్రసారం చేయడం వల్ల రేపు జరిగే ఆర్కేనగర్ ఉపఎన్నిక పోలింగ్పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం పడే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఆ మేరకు మీడియా సంస్థలకు ఈసీ లేఖలు రాసింది. జయ వీడియో టెలీకాస్ట్ చేస్తే.... ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లవుతుందని హెచ్చరించింది. అంతేకాదు జయ వీడియో విడుదలపై నివేదిక అందజేయాలని తమిళనాడు ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది. అయితే ఈ వీడియో బయటికి వచ్చిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జాతీయ, ప్రాంతీయ ఛానళ్లు విపరీతంగా ప్రసారం చేశాయి.