పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి ఇప్పటికే ఓవర్సిస్ లో విడుదలైన సినిమా సూపర్ హిట్ అనే టాక్ నడుస్తోంది. దీనికి తోడు దుబాయ్ లో విడుదలైన అజ్ఞాతవాసి సినిమాపై సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు రివ్యూ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు అయ్యేలా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. సెకెండ్ ఆఫ్ లో పవన్ కల్యాణ్ తో పాటు విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసినట్లు టాక్ . గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల అనే చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో విక్టరీ వెంకటేష్ అలాగే అలరిస్తారని రివ్యూ రిపోర్ట్ లో తేలింది. కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో అయినా ఆది పినిశెట్టిది సెకెండ్ మేజర్ రోల్ అని టాక్. దీంతో ఆదికి మరిన్ని అవకాశాలు వచ్చి పడతాయని క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.