హుజుర్నగర్లో ప్రజాకూటమి అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. మొదట వెనుకంజలో ఉన్న ఉత్తమ్.. చివరి రౌండ్స్ వచ్చేసరికి అధిక ఓట్లు సాధించి ఊపిరి పీల్చుకున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఘన విజయం సాధించారు. ఆంధోల్లో టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ విజయం సాధించారు. ఖైరతాబాద్లో దానం నాగేందర్ విజయ దుందుబి మోగించారు.