తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ఉత్తమ్ అనుమానాలు

Update: 2018-12-11 06:26 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్‌ జరిగినట్లు టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఫలితాలను చూస్తే  టాంపరింగ్‌ చేసినట్లు అర్థం అవుతుందన్నారు. వీవీప్యాట్‌ల్లో స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థులంతా రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. వీవీప్యాట్‌లను లెక్కించే వరకు పట్టుబట్టాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ఎవరు ఓడిపోతారో టీఆర్‌ఎస్‌ నేతలు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇదంతా ట్యాంపరింగ్‌ను బలపరుస్తున్నాయని ఉత్తమ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

Similar News