స్వామిగౌడ్‌‌ను కలిసిన ఉత్తమ్‌, షబ్బీర్

Update: 2018-12-21 06:47 GMT

కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్సీలు, మండలి ఛైర్మన్ ను కలిసిన కొద్దిసేపటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా స్వామిగౌడ్ ను కలిశారు. తిరుగుబాటు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి, శాసన మండలి పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయడం కుదరదని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు సీఎల్పీ మీటింగ్ పెట్టే అవకాశం లేదని పార్టీ మారిన వారిపై ముందుగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Similar News