నేపాల్లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించించి. ట్రక్కు లోయలో పడి 20మంది దుర్మరణం, మరో 17 మందికి త్రీవగాయాలయ్యాయి. ఖాట్మాండ్ సమీపంలోని నువాకోట్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేకుంది. గాయపడ్డవారిని హుటాహుటినా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం గయాంగడండా ప్రాంతంలో కొండపై నుంచి వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 20మంది మృతదేహాలను బయటకుతీసమని పోలీసులు తెలిపారు. ట్రక్కులో అధికసంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించడం వల్లే ట్రక్కు అదుపుతప్పినట్లు అధికారు వెల్లడించారు.