ఘోర రోడ్డు ప్రమాదం..

Update: 2018-07-08 11:50 GMT

రాజస్థాన్‌లో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది.  బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో భారీ ప్రమాదం జరిగి 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో  21 మందికి  తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అజ్మీర్‌లో ప్రాంతంలో చోటుచేసుకుంది. . బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక  సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News