కేసీఆర్ వందల కోట్లు ఖర్చుచేసినా జనం మా వెంటే ఉన్నారు

Update: 2018-12-08 11:09 GMT

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ వందల కోట్లు ఖర్చుచేసినా జనం మా వెంటే ఉన్నారని టి టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. కూటమిగా ఏర్పడిన తర్వాత 86 సంఘాలు తమతో కలిసివచ్చాయని వారందరి సహకారంతో తాము 70 నుంచి 80 సీట్లు సాధిస్తామని రమణ ధీమా వ్యక్తం చేశారు. మోడీ కేసీఆర్ చర్యలు తెలంగాణకు ప్రమాదకరంగా మారాయని అందువల్లే ప్రజలు ప్రజాకూటమివైపు మొగ్గు చూపారని రమణ అన్నారు. 2014 కన్నా ఓటింగ్‌ మరింత శాతం పెరిగిందన్నారు. అధికారులను అడ్డుపెట్టుకొని ఓట్లు తొలగించినా, ఇష్టానుసారంగా ఓటరు లిస్టును తయారు చేసినా.. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసినా ఓటర్లు చైతన్యంతో ఓట్లు వేశారని అన్నారు. 
 

Similar News