నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తిరుమలలోనే ప్రాణత్యాగం చేస్తా

Update: 2018-06-05 14:23 GMT

రమణదీక్షితులు ఆరోపణలకు టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రమణ్యం కౌంటర్ ఇచ్చారు. వెయ్యి కాళ్ల మండపం కూల్చేయడంలో తన ప్రమేయం లేదన్న బాలసుబ్రమణ్యం.... నాలుగో మాడ వీధిలో రమణదీక్షితుల ఇంటితో సహా అన్ని ఇళ్లను తొలగించామన్నారు. అందరికీ శాశ్వత ఇళ్లను నిర్మించి ఇచ్చామని, రమణదీక్షితులకు త్రిబుల్‌ బెడ్రూమ్‌ కాటేజీ ఇచ్చామన్నారు. మిరాశిలను వ్యతిరేకించడం వల్లే తనపై ఆరోపణలు చేశారన్న బాలసుబ్రమణ్యం.... మిరాశిలతో మిగతా బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతోందన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లే నిరూపిస్తే తిరుమల శ్రీవారి ముందే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమన్నారు టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రమణ్యం.

Similar News