క్యూలో నిలబడి ఓటేసిన ఎంపీ కవిత

Update: 2018-12-07 06:12 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత నిజామాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోతంగల్‌లోని 177వ నెంబర్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. ఓటర్లతో కలిసి క్యూలైన్‌లో నుంచొని కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి ఓట్లు వేశారు. ఉదయం 11గంటల వరకూ 23.17శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

Similar News