కౌంటర్ ఆపరేషన్కు దిగిన కాంగ్రెస్...కాంగ్రెస్లోకి డీఎస్, కొండా సురేఖ, బాబు మోహన్?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ రెండో దశ ఆపరేషన్ మొదలు పెట్టగా కాంగ్రెస్ కౌంటర్ ఆపరేషన్కు దిగింది. టీఆర్ఎస్లో అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. ఈ నెల 12న కాంగ్రెస్లోకి భారీగా వలసలుంటాయని టీ.కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్తో పాటు కొండా సురేఖ దంపతులు, నందీశ్వర్గౌడ్, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.