కౌంటర్‌ ఆపరేషన్‌కు దిగిన కాంగ్రెస్‌...కాంగ్రెస్‌లోకి డీఎస్‌, కొండా సురేఖ‌, బాబు మోహన్‌?

Update: 2018-09-08 03:59 GMT

తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ జోరందుకుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్‌ రెండో దశ ఆపరేషన్‌ మొదలు పెట్టగా కాంగ్రెస్‌ కౌంటర్‌ ఆపరేషన్‌కు దిగింది. టీఆర్ఎస్‌లో అసంతృప్తులకు కాంగ్రెస్‌ గాలం వేస్తోంది. ఈ నెల 12న కాంగ్రెస్‌లోకి భారీగా వలసలుంటాయని టీ.కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌తో పాటు కొండా సురేఖ దంపతులు, నందీశ్వర్‌గౌడ్‌, టీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్‌ రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. 

Similar News