ప్రోఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకున్న టీఆర్ఎస్ నేతలు

Update: 2018-06-21 08:34 GMT

బంగారు తెలంగాణ కల సాకరమవుతున్న సమయంలో  ప్రోఫెసర్ జయశంకర్ లేకపోవడం  బాధకరమన్నారు మంత్రి కేటీఆర్‌. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.  జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు.    నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్న కేటీఆర్‌ .. శరవేగంగా ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్లు అందిస్తున్నామన్నారు.  ఉపాధి అవకాశాలు, నియమాకాలు తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు.  

Similar News