బంగారు తెలంగాణ కల సాకరమవుతున్న సమయంలో ప్రోఫెసర్ జయశంకర్ లేకపోవడం బాధకరమన్నారు మంత్రి కేటీఆర్. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్న కేటీఆర్ .. శరవేగంగా ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఉపాధి అవకాశాలు, నియమాకాలు తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు.