మాజీ మంత్రి బీజేపీ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అయన తల్లి నాగం నారాయణమ్మ(96) కన్నుమూశారు. వయసు మీద పడటంతో అనారోగ్యం భారిన పడిన నారాయణమ్మ నిమ్స్ లో చేరారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం నారాయణమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. నారాయణమ్మ మృతిపట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.