తెలంగాణలో రెబల్ అభ్యర్థులపై కాంగ్రెస్ వేటు వేసింది. ఎన్నికల బరిలో నుంచి వెనక్కి తగ్గని.. 19 మంది రెబల్ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేసింది. వీరిని ఏడేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం టీపీసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. పార్టీ టికెట్ అశించి భంగపడ్డ నేతలను బుజ్జగింపులతో వెనక్కు తగ్గించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ.. వినని నేతలపై వేటు వేసింది.
కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ రెబల్ అభ్యర్థులు వీరే
రవి శ్రీనివాస్-సిర్పూర్
బోడ జనార్దన్-చెన్నూరు
హరినాయక్-ఖానాపూర్
అనిల్జాదవ్-బోథ్
నారాయణరావు పటేల్-ముథోల్
అరుణతార-జుక్కల్
రత్నాకర్-నిజామాబాద్ అర్బన్
శ్రీగణేష్-సికింద్రాబాద్
శివకుమార్రెడ్డి-నారాయణపేట్
ఇబ్రహీం-మహబూబ్నగర్
సురేందర్రెడ్డి-మహబూబ్నగర్
బిల్యానాయక్-దేవరకొండ
పాల్వాయి స్రవంతి-మునుగోడు
రవికుమార్-తుంగతుర్తి
నెహ్రూ నాయక్-డోర్నకల్
వూకె అబ్బయ్య-ఇల్లందు
బాలాజీనాయక్-ఇల్లందు
ఎడవల్లి కృష్ణ-కొత్తగూడెం
రాములు నాయక్(వైరా)