తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను bie.telangana.gov.in కు లాగిన్ అయి తెలుసుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ఫలితాలతో ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 72.2 శాతం, సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78.7 శాతానికి చేరింది. ఈ నెల 18 వరకు రీవాల్యుయేషన్, కౌంటింగ్కు అవకాశముంది.