ఆశావహుల నుంచి ధరఖాస్తులకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విధించిన గడువు ఇవాళ్టితో ముగిసింది. ఇవాళ్టి వరకు మొత్తం వెయ్యీ 76 ధరఖాస్తులు వచ్చాయి. ఇవాళ్టినుంచి వాటిని పరిశీలించనున్నారు. ఆశావహుల సామాజిక, ఆర్థిక, స్థానిక బలాబలాలపై అంచనా వేస్తున్నారు. నేటి నుంచి అభ్యర్థుల స్క్రూటినీ చేయనున్నారు. నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేసి.. స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పష్టం చేశారు. సర్వే ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీట్ల సర్దుబాటు తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నామని ఉత్తమ్ తెలిపారు.