11 స్థానాలకు టీడీపీ అభ్యర్ధులు దాదాపు ఖరారు అయ్యారు. అయితే అభ్యర్ధులను రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మచ్చ నాగేశ్వర్రావు, వరంగల్ వెస్ట్ నుంచి రేవూరి ప్రకాష్రెడ్డి పోటీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే మక్తల్ నుంచి కొత్తకోట దయాకర్రెడ్డి, మహబూబ్నగర్ నుంచి ఎర్ర శేఖర్, ఉప్పల్ నుంచి వీరేందర్ గౌడ్, శేరిలింగంపల్లి నుంచి భవ్య ఆనంద్ ప్రసాద్, కూకట్పల్లి నుంచి పెద్దిరెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి మండవ వెంకటేశ్వర్రావు పోటీ చేస్తారని అంటున్నారు.