మహాకూటమి ప్రచారం ముమ్మరం చేసింది. కూకట్ పల్లి మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా సోదరుడు తారకరత్న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తారకరత్న సుహాసినికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్ లో పలు బస్తీల్లోకి వెళ్లిన ఆయన, సుహాసినిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. సుహాసిని గెలిస్తే, ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. తారకరత్నతో పాటు పలువురు నందమూరి కుటుంబీకులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.