అనూహ్యంగా కూకట్పల్లి టికెట్ దక్కించుకున్న నందమూరి సుహాసిని నేడు నామినేషన్ వేయనున్నారు. నందమూరి బాలకృష్ణతో కలిసి ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం బయల్దేరిన ఆమె కూకట్పల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో 11:21 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఆమె వెంట బాలకృష్ణ, టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పెద్దిరెడ్డి ఇతర నేతలు ఉన్నారు.