కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ

Update: 2018-12-16 13:34 GMT

దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాంస్య విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆవిష్కరించారు.ఇవాళ (ఆదివారం) తమిళనాడు వెళ్లిన సోనియా గాంధీ అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో కేరళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీతారాం ఏచూరి,  రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, వైగోలతో పాటు తదితర జాతీయ, రాష్ట్ర నేతలు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు.

Similar News