టీఆర్ఎస్‌కు మరో షాక్...పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే...

Update: 2018-11-21 09:30 GMT

ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్‌కు షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ఒక పక్క సీఎంతో సహా అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే అసంతృప్తులు వరుసగా పార్టీని వీడుతున్నారు. టీఆర్ఎస్‌ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. టికెట్ విషయంలో మంత్రి మహేందర్‌రెడ్డి తనకు నమ్మక ద్రోహం చేశారని, ఆ అవమానాన్ని భరించలేకే టీఆర్ఎస్‌కు రాజీనామా చేశానని సంజీవరావు తెలిపారు. తన నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్‌కు మద్దతిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

Similar News