అందుకే నాకు అన్యాయం: శంకరమ్మ

Update: 2018-11-17 05:47 GMT

తాను బీసీని కాబట్టే అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ నాయకురాలు, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శంకరమ్మ నిన్న ఎల్బీనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. తనకు టికెట్ దక్కకపోవడంపై శంకరమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో కేసీఆర్‌కే వదిలేస్తున్నానని అన్నారు. 2014 ఎన్నికల్లో వెయ్యి మంది అమరవీరుల కుటుంబాలకు ఒక్క సీటు ఇచ్చారని, ఇప్పుడు అది కూడా దక్కలేదని వాపోయారు.  

Similar News