నిర్మల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ పిల్లను కిందకు దించేయడంతో ప్రాణహాని తప్పింది. ప్రమాదం సమయంలో ఆటోలో ముప్పై మంది విద్యార్థులున్నారు. అక్కాపూర్ నుంచి స్కూల్ పిల్లలతో వస్తున్న ఆటో నిర్మల్ ఎస్పీ కార్యాలయం వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే మంటలను ఆర్పివేశారు.