స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతదారులకు బంప్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకు ఉచిత ప్రెట్రోల్ ఆఫర్ను మరికొన్ని దినాలు పొడిగించింది. ఎస్బీఐ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో 5లీటర్ల దాకా పుక్కిడికే పిట్రోల్ ఆఫర్ చేస్తున్న గి పథకం గడువు జెర్రాంత పెంచిర్రు పొయిన నెల 23తోనే గి ఆఫర్ ముగిసింది. అయితే ఈ నెల డిసెంబర్ 15తేది వరకు పొడిగించినట్లు ఎస్బీఐ ట్వీట్టర్ వేదికగా ప్రీ పెట్రోల్ ఆఫర్ను పొడిగించినట్లు తెలిపింది. ఆఫర్ పొందాలంటే ఎస్బీఐ కార్డు లేదా భీమ్ ఎస్బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్లెట్ల ద్వారా పెట్రోల్ కొంటే 5 లీటర్ల వరకు పెట్రోల్ను ఉచితంగా పొందవచ్చని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. రూ.100 రూపాయల విలువైన పెట్రోలు కొనుగోలు చేయాలి. తరువాత 2018 ఏప్రిల్ 1నాటికి 18 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసున్న ప్రతి భారత పౌరులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందట. కాగా 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెలఅధికార కోడ్ను 9222222084కు సెండ్ చేయాలి.