పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన వారిని మంథనిలోని కృష్ణవేణి స్కూల్ నిర్వాహకుడు అరుణ్కుమార్గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో అరుణ్కుమార్తో పాటు భార్య, కుమారుడు, కుమార్తె మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఒకేసారి కుటుంబ సభ్యులంతా చనిపోవడంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.