టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే తనకొచ్చే నష్టం ఏం లేదని ఇంట్లో రెస్ట్ తీసుకుంటానని ఖానాపూర్ ప్రచారసభలో కేపీఆర్ అనడాన్ని రేవంత్ తప్పు పట్టారు. ఓడిపోతే ఇంటికి పోతాననీ కేసీఆర్ అమెరికా వెళ్తానని కేటీఆర్ అంటున్నారనీ అధికారం లేకపోతే ప్రజలకు సేవచేయరా అని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతో కేసీఆర్లో నిరాశా నిస్పృహ ఆవహించాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ వస్తున్నారనగానే టీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు.