తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతకొద్ది రోజులుగా కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఇంటి నుంచే వ్యవహారాలు చక్కబెట్టడంపై రేవంత్ విమర్శలు గుప్పిస్తూ ఓ ట్వీట్ చేశారు.‘సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టకుండా, ఇంటి నుంచి నిద్రావస్థలో పని చేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్న మన ముఖ్యమంత్రికి ‘కుంభకర్ణ అవార్డు’ ఇవ్వాలి.. స్లీపింగ్ మోడ్ సీఎం @ తెలంగాణ సీఎంఓ’ అంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Our Chief Minister should be given the ‘Kumbhakarna award’ on completing one year of ‘work from home’ in sleeping mode, without stepping into the ‘secretariat’.. #sleepingmodeCM @TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) February 3, 2018