ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాపై నిరసన తెలిపేందుకు వచ్చిన రాయలసీమ ఉద్యమకారులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా... ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలో రాయలసీమ భాష, జీవితాల్ని కించపరచడాన్ని నిరసిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దృష్టికి తీసుకెళ్లేందుకు వస్తున్న వీరి వాహనం ప్రమాదానికి గురైంది. ఓ టీవీ చానెల్ డిబేట్ లో పాల్గొనడానికి హైదురాబాద్ వస్తూ మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట వద్ద ఈ యువకులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.