రాజస్తాన్‌లో పోలింగ్‌ ప్రారం‍భం

Update: 2018-12-07 02:23 GMT

ఉదయం 7.45: గంటలకు రాజస్థాన్ లో పోలింగ్‌ ప్రారం‍భం అయింది. ముందుగా రాజస్తాన్‌లోని సర్థార్‌పుర నియోజకవర్గం బూత్‌ నెం:106లో మాక్‌పోలింగ్‌ జరిపి పోలింగ్ ను ప్రారంభించారు అధికారులు. పోలింగ్‌ సజావుగా సాగేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. 200 స్థానాలకు గాను199 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు.

Similar News