కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావని రాహుల్ మరోసారి విమర్శించారు. కోదాడలో కాంగ్రెస్ ప్రచార సభకు హాజరైన రాహుల్ నాలుగన్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో యువతకు, రైతులకు కేసీఆర్ చేసిందేమీలేదని విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే కేసీఆర్ అండగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల పేరు మార్చి 50 వేల కోట్లు దోచుకున్నారని ఈ నాలుగేళ్లలో కేటీఆర్ ఆదాయం 400 శాతం పెరిగిందని రాహుల్ తెలిపారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలపై తలా 2లక్షల అప్పుందని రాహుల్ అన్నారు.