ఒక్కటికెట్ కేటయించడంపై యాదవ సంఘాల ఆందోళన

Update: 2018-11-18 11:22 GMT

గాంధీభవన్ వద్ద యాదవ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. యాదవులకు ఒక్కటికెట్ మాత్రమే కేటాయించడంపై నిరసనకు దిగిన నేతల కనీసం 5 టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. దీంతో యాదవుల సమస్యను అదిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వీహెచ్ హామీ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. యాదవులకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 

Similar News