కర్ణాటక గవర్నర్ నియమించిన ప్రొటెం స్పీకర్ బొపయ్య నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ వేసిన పిటీషన్ను.. సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ ఉదయం జరిగిన విచారణలో భాగంగా.. ప్రొటెం స్పీకర్ ఎంపికపై అభ్యంతరాలున్నాయని.. కాంగ్రెస్, జేడీఎస్ తరపున లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదించారు. బొపయ్య వివాదాస్పదుడని.. చెప్పారు. అయితే దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రొటెం స్పీకర్ ఎన్నికపై ప్రస్తుతం ఆదేశాలిస్తే.. విశ్వాస పరీక్ష వాయిదా వేయాల్సి వస్తుందని తెలిపింది. దీంతో బొపయ్య ఆధ్వర్యంలోనే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అలాగే దేశంలోని అన్ని ఛానెళ్లలో బలనిరూపణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ వేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.