టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నట్లు టాక్. ప్రభాస్ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ డైరక్షన్ లో సాహో అని సినిమాలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని యాక్షన్స్ సీన్స్ ను దుబాయ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సాహో షూటింగ్ కొనసాగుతుండగా మరోసినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు ఫిల్మింనగర్ లో వార్త చక్కెర్లు కొడుతుంది. జిల్ డైరక్టర్ రాధాకృష్ణ ప్రభాస్ తో సినిమా తీయాలని ఉవ్విళ్లూరుతున్నారట. అయితే ప్రభాస్ కు అదిరిపోయే లవ్ స్టోరీ చెప్పారట. అందుకు ఇంప్రెస్ అయిన ప్రభాస్ సాహో షూటింగ్ కొనసాగుతుండగా రాధాకృష్ణ తో చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట.
మరో నాలుగు నెలల్లో సాహో లో ప్రధాన సీన్స్ ని ముగించి రాధా కృష్ణ రొమాంటిక్ లవ్ స్టొరీ లో పాల్గొంటాడట. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాది సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.