తెలంగాణలో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సిద్ధిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి అయ్యింది. మొదటి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్రావు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 6,338 ఓట్ల ఆధిక్యంలో హరీశ్రావు దూసుకెళ్తున్నారు. సిద్ధిపేట నియోజవర్గంలో కూటమి అభ్యర్థిగా భవానీ రెడ్డి, బీజేపీ నుంచి నాయిని నరోత్తమ్రెడ్డి బరిలో ఉన్నారు.