కేసీఆర్ గెలవాలని దేవున్ని వేడుకున్న...ఏపీలో జగన్ గెలుపు కోసం కేసీఆర్ కృషి చేయాలి
అతి తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్ మళ్లీ గెలవాలని మరోసారి సీఎం కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు నటుడు పోసాని కృష్ణమురళి. లగడపాటి సర్వే తప్పుల తడక అన్న ఆయన. తెలంగాణ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలకు కుల పిచ్చిలేదని కేసీఆర్పై అంతులేని అభిమానం ఉందన్నారు. ఏపీలో జగన్ గెలుపుకు కేసీఆర్ కృషి చేయాలన్నారు. జగన్కు ఉన్న ఫాలోయింగ్ చంద్రబాబుకు లేదన్నారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో వంద శాతం వైఎస్ జగన్ గెలుస్తారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇంత ప్రజాదరణ దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్లకు కూడా రాలేదు. జగన్ పరిపక్వత గల నాయకుడు. ఆయన గెలిస్తే కుల పిచ్చి, రౌడీయిజం, దోపిడీలుండవు. రాష్ట్రం బాగుపడుతుంది. ఒకవేళ కేసీఆర్ ఏపీలో పోటీ చేసినా.. నా మద్దతు జగన్కే ఉంటుంది. ఆయన అవినీతి చేయలేదు. అన్యాయంగా ఇరికించారు. ఎంత మంది పోటీలో ఉన్నా ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగనే అన్నారు.