యాదగిరిగుట్టలో మరోసారి కలకలం...ఓ ఇంట్లో అనుమానాస్పదంగా ఉన్న ఎనిమిదేళ్ల బాలిక

Update: 2018-08-18 07:22 GMT

యాదగిరిగుట్టలో మరోసారి కలకలం రేగింది. సుభాష్ నగర్, అంగడి బజార్, గణేష్ నగర్‌లలో  తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ ఇంట్లో అనుమానాస్పదంగా ఉన్న ఎనిమిదేళ్ల బాలికను గుర్తించారు. బాలిక చెబుతున్న వివరాలకు ఇంట్లో ఉన్న వివరాలు సరిపోకపోవంతో  ఇంట్లోని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను గత నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి బారిన పడిన ఎనిమిది మంది చిన్నారులను కాపాడారు. తాజాగా  ఈ ఘటన వెలుగు చూడటంతో మరోసారి చర్చనీయంగా మారింది. 
 

Similar News