టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్తుండగా కోదండరామ్ను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. కోదండరామ్తో పాటు 25 మంది టీజేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. పోలీసులను ఉపయోగించి కేసీఆర్ సభను అణచివేయాలని భావిస్తే, అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. శాంతియుతంగా సభ నిర్వాహించాలని తాము భావించామని..కావాలనే టిఆర్ఎస్ సర్కారు ఉద్రికత్తలను పెంచుతోందని కోదండరామ్ ఆరోపించారు.