మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు మాయం: రాహుల్

Update: 2018-12-07 11:48 GMT

ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ముగిసిన ఏకంగా స్ట్రాంగ్ రూమ్ నుంచే ఈవీఎంలు గల్లంతైనట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక కొన్ని ఈవీఎంలు అయితే హోటల్లో ఛాయ్ తాగుతూ కనిపించాయని మోడీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రం విసిరారు. భారతప్రధాని నరేంద్రమోడీ ఇండియాలో ఈవీఎంల దుస్థితి ఇలా దపరించిందని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్ట్రాంగ్ రూంల వద్ద రక్షణ ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు.

Similar News