రేప్ కేసులో దోషిగా తేలిన ఎమ్మెల్యే

Update: 2018-12-15 15:03 GMT

ఆర్జేడీ బహిష్కృత, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజ్‌బల్లభ్ యాదవ్‌ను రేప్ కేసులో కోర్టు దోషిగా తేల్చింది  
బీహార్ లోని నవడాకు చెందిన ఓ బాలికపై ఫిబ్రవరి 2016లో అత్యాచారానికి పాల్పడినట్టు  ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బర్త్ డే పార్టీ పేరుతో సదరు బాలికను తీసుకెళ్లిన పక్కింటి వ్యక్తి  
ఎమ్మెల్యేకు చెందిన ఓ రూమ్ లో ఆమెను నిర్బంధించాడు. అక్కడ తనపై ఎమ్మెల్యే రాజ్‌బల్లభ్ అత్యాచారానికి పాల్పడ్డార ఆ బాలిక  2016లో ఫిబ్రవరి 9న కేసు పెట్టింది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. అత్యాచారం కేసు నమోదు అవడంతో ఎమ్మెల్యే రాజ్‌బల్లభ్‌ను ఆర్జేడీ బహిష్కరించింది. ఈ కేసులో మొత్తం 22 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఎమ్మెల్యే రాజ్‌బల్లభ్‌తోపాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఈ నెల 21న వారికి శిక్షలు ఖరారు చేయనుంది.  

Similar News