ఇరాన్లో ఘోర ప్రమాదం జరిగింది. టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న విమానం మధ్య ఇరాన్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 66 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 60 మంది ప్రయాణికులు..ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. టెహరాన్లో టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆ విమానం రాడార్ లో కనిపించకుండా పోయింది. తర్వాత కొద్ది సేపటికి సెమిరామ్ టౌన్ దగ్గర్లోని కొండ ప్రాంతంలో విమానం కూలింది. ఎమర్జెన్సీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా.. వాతావరణం సరిగా లేకపోవడంతో వెళ్లలేకపోయింది. దీంతో సహాయక చర్యలు ఆలస్యమౌతున్నాయి.