వికారాబాద్ జిల్లాలో ఓ ప్యారాషూట్ అకస్మాత్తుగా కుప్పకూలడం కలకలం రేగింది. ఊటుపల్లి ఫారెస్ట్లో పారాచ్యూట్ కూలిపోయింది. దీన్ని చూసిన స్ధానికులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే అది వాతావారణ పరిశోధన శాఖకు చెందిన ప్యారాషూట్గా అధికారులు గుర్తించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరిశోధనలో భాగంగానే అటవీ ప్రాంతంలో ప్యారాషూట్ని దించామని టీఐఎఫ్ఆర్ సిబ్బంది పేర్కొంది. ప్యారాషూట్ చెందిన విడిభాగాలు వేర్వేరు గ్రామాల్లో పడిపోయినట్టు గుర్తించారు.