టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ...బీజేపీలోకి...

Update: 2018-10-11 07:38 GMT

అధికారమే లక్ష్యంగా పోరాడుతున్న టీ కాంగ్రెస్‌కు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి,  ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలను కనుచూపుతో శాసించిన చరిత్ర దామోదర రాజనర్సింహ కుటుంబానిది. బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

Similar News