ఏప్రిల్ లో కొత్త రేషన్ కార్డులు : ఈటల

Update: 2018-03-25 09:23 GMT

తెలంగాణ రాష్ట్రంలో  ఏప్రిల్ 30 లోపు కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్.  కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం ఇప్పటి వరకు 89 వేల 713 దరఖాస్తులను పరిశీలించామని తెలిపారు. 77 వేల 100 కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేశామని చెప్పారు. మరో ఒక లక్షా 66 వేల దరఖాస్తులు పరిశీలించి కార్డులు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆహార భద్రత చట్టాన్ని 2015 నుంచి అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మార్వాడీ కొట్టులా ఉండకూడదని.. పేదల దుఖాన్ని తీర్చేలా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 

Similar News