నేపాల్లో ఘోరో విషాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కళాశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది దుర్మరణం చెందారు. మరో 14మందికి తీవ్రగాయాలపాలయ్యారు. ఖాట్మాండ్లోని సేన్చుక్ పాలిటెక్నిక్ విద్యార్థులు టూర్ వెళ్లివస్తుండగా శనివారం తెల్లవారు జామునా చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటినా ఘటనస్థలికి చేరుకోని క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరిలించారు. రాజధానికి 400 కిలోమీటర్ల దూరంలో రామ్రీ గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పిన బస్సు 700 మీటర్ల ఎత్తు నుంచి లోయలో పడిపోయిందని అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో నేపాల్ జరిగిన రెండో ప్రమాదం ఇది.